కలెక్టర్ శర్మన్
వైద్యసిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం
నాగర్కర్నూల్, మే 15: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ శర్మన్ సూచించారు. శనివారం అదనపు కలెక్టర్ శ్రీనివార్రెడ్డితో కలిసి దవాఖానను సందర్శించారు. కరోనా కట్టడిలో భాగంగా జిల్లా దవాఖానను సందర్శించి సమీక్షించారు. కరోనా రోగులు, ఇతర వైద్యం కోసం వచ్చినవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దవాఖానకు మంజూరై ఆక్సీజన్ ప్లాంటును త్వరగా ఏర్పాటు చేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. వైద్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాజరుకాకపోవడంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖానకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు స్థలం ఉన్నచోట పార్కింగ్ కోసం పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.