మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో 60మంది చేరిక
హన్వాడ, మే 10: పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గుడిమల్కాపురానికి చెందిన 60మంది యువకులు సోమవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కరుణాకర్గౌడ్, శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ఎంపీపీ బాలరాజు, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచులు బాలాగౌడ్, రేవతి, ఎంపీటీసీ మల్కయ్య, నాయకులు రమణారెడ్డి, జంబులయ్య, కొండ బాలయ్య, సుధాకర్రెడ్డి, యాదయ్య, మోహన్, సత్యం, బసిరెడ్డి, అనంద్, ఖాజాగౌడ్ పాల్గొన్నారు.