మిడ్జిల్, జూన్ 9 : కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరు వు తయారు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని జిల్లా ఐఈసీ పవన్ అన్నారు. బుధవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు షెడ్లలో కుల్లించి సేంద్రియ ఎరువుగా మార్చే విధానంపై అవగాహన కల్పించారు. సంప్రదాయ పద్ధతిలో ఆవు పేడ, పంచితం, గడ్డి, తడిచెత్త, కాయగూరు వ్యర్థాలు, కలుపు మొక్కలు, పండ్లతొక్క, పాడైన పూలతో తయారుచేసిన వర్మీ కంపోస్టు వాడకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, సర్పంచ్ సంయుక్తరాణి, ఎంపీవో అనురాధ, ఎంఐఎస్ రవి, పంచాయతీ కార్యదర్శులు బాబా న్న, రమేశ్, హన్ముంతు, ఇబ్రహీం, ప్రశాంత్, మధు, జ్యోతి, సాయిప్రియ, సుదర్శన్ పాల్గొన్నారు.