ఊర్కొండ, మే 8: మండలంలోని ఊర్కొండపేటకు చెందిన పేద ముస్లిం కుటుంబానికి కల్వకుర్తి న్యూ రమ్య దవాఖాన వైద్యురాలు రమ్యసౌజన్య అండగా నిలిచారు. శనివారం తన సిబ్బందితో కలిసి ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందించారు. కరోనా కష్ట సమయంతోపాటు రంజాన్ పర్వదినం సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబానికి అండగా నిలువడంపై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గతంలో కూడా ఆమె ఆ కుటంబానికి చెందిన అమ్మాయికి ఆన్లైన్ క్లాసుల కోసం మొబైల్ను ఉచింతంగా అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్, గ్రామ యువకులు గిరితోపాటు దవాఖాన వైద్య సిబ్బంది ఉన్నారు.