కందనూలు, మే 8 : ఆరోగ్య విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఫీవర్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మండల వైద్యాధికారి దశరథం అన్నారు. శనివారం వారి ఆధ్వర్యంలో మండలంలోని 24 గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కాలనీల్లో ప్రజలకు థర్మల్ స్క్రీనింగ్ చేసి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనే విషయాలను ఆరా తీశారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పాజిటివ్ రిపోర్ట్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని కరోనా నివారణకు కావాల్సిన మందులను కిట్ను అందించి మీ ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తామని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆశకార్యకర్తలు,వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, మే 8: గ్రామాల్లో ప్రజలు కరోనాపై ఆందోళన చెందొద్దన్న ఉద్దేశంతో వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వే ముమ్మరంగా సాగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆశ, అంగన్వాడీ, హెల్త్, గ్రామ పంచాయతీ సిబ్బంది బృందంగా ఏర్పడి జ్వరపీడితుల వివరాలు సేకరిస్తున్నట్లు డాక్టర్ మౌనిక తెలిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు తగు సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి ఇంటి వద్దకే వెళ్లి సంబంధిత మందుల కిట్లను అందజేస్తారన్నారు. మొదటిసారి వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండోసారి వ్యాక్సిన్ను సమయానికి తీసుకోవాలని సూచించారు. పెద్దకొత్తపల్లి పీహెచ్సీలో ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.