ఎమ్మెల్యే జైపాల్యాదవ్
ముస్లింలకు గిఫ్టు ప్యాక్ల పంపిణీ
కల్వకుర్తి, మే 7: రాష్ట్రంలోని అన్నిమతాల ప్రజలను సమాన దృష్టితో చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మతసామరస్యానికి పెద్దపీట వేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదముస్లింలు పండుగను సుఖః సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం సమకూర్చిన రంజాన్ కిట్లను మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో కల్వకుర్తి మున్సిపాలిటీలోని మసీదుల వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిమతాల ప్రజలను గౌరవిస్తూ వారికి అండగా నిలబడిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ముస్లింలు కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్లు బోజిరెడ్డి, సైదులుగౌడ్, ఎజాస్, టీఆర్ఎస్ నాయకులు మధు, శ్రీను, తాహేర్, తెలంగాణ జాగృతి నాయకులు గణేశ్, మైనార్టీలు పాల్గొన్నారు.