నమస్తే తెలంగాణ ఎఫెక్ట్
సిండికేట్ వ్యాపారంపై ప్రజాప్రతినిధులు, అధికారుల సీరియస్
అంబులెన్స్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించిన అధికారులు
కల్వకుర్తి, జూన్ 5: కరోనా విపత్తులో రోగుల భయాన్ని ఆసరా చేసుకుని వ్యాపార దందాకు తెరలేపిన అంబులెన్స్ల నిర్వాహకులపై అధికారులు కన్నెర్ర చేశారు. అంబులెన్స్ల నిర్వాహకులు కల్వకుర్తి నుంచి హైదరాబాద్కు రూ.18వేలు వసూలు చేస్తున్న తీరుపై నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన కరోనా వేళ కాసుల కక్కుర్తి అనే వార్తకు అధికారులు తీవ్రంగా స్పందించారు. పద్ధతి మార్చుకోకుంటే అంబులెన్స్ల నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబులెన్స్ల నిర్వాహకులు తీరుపై వచ్చిన కథనంపై సామాన్య జనం హర్షం వ్యక్తం చేశారు. అంబులెన్స్ల నిర్వాహకుల తీరుపై మండి పడ్డారు. కరోనాతో జనం అల్లాడుతుంటే.. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా అంబులెన్స్ల నిర్వహకుల తీరు ఉందని అసహ్యించుంకుంటున్నారు. పాండమిక్ డిజార్టర్ మేనేజ్మెంట్ కింద కాసుల కోసం కక్కుర్తి పడుతున్న అంబులెన్స్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంత ధర ఎందుకంటే..
హైదరాబాద్కు రూ.18వేలు చాలా ఎక్కువ కదా అంటే.. మా లైఫ్ రిస్క్లో పెడుతున్నాం. అని అంబులెన్స్ల నిర్వాహకుల నుంచి సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని డాక్టర్ రమేశ్ చంద్రని అడిగితే.. మేమందరం కొవిడ్ వార్డుల్లో పనిచేస్తున్నాం. మాకు లేని రిస్క్ అంబులెన్స్ వారికి ఉంటుందా అని ప్రశ్నించారు. కరోనా విధుల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాని రిస్క్ అని డబ్బులు ఎక్కువ తీసుకోవడం భావ్యంకాదని డాక్టర్ రమేశ్ చంద్ర పేర్కొన్నారు. పాండమిక్ డిజార్డర్ మెనేజ్మెంట్ ప్రకారం ఎక్కువ డబ్బులు వసూలు చేసే అంబులెన్స్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటాం
అంబులెన్స్ నిర్వాహకులు సిండికేట్గా మారి రోగులు నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్ధం. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ఇచ్చాం. అంబులెన్స్ నిర్వాహకులను పిలిపించి హెచ్చరిస్తాం. రోగుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా నిఘా పెడతాం.పద్దతి మార్చుకోకుంటే అంబులెన్స్ల నిర్వాహకులపై పాండమిక్ డిజార్టర్ మేనేజ్మెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.
పద్ధతి మార్చుకోవాలి
అంబులెన్స్ల దోపిడీ గురించి ఇదివరకే తన దృష్టికి రావడం తో వారిని పిలిచి హెచ్చరించా. వారితో ఇదివరకే మీ టింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో స మావేశం తేదీని నిర్వహించాం. కొవిడ్ స హాయక చర్యల్లో భాగంగా మీటింగ్ వా యిదా పడింది. ఒకటి రెండు రోజుల్లో అం బులెన్స్ నిర్వాహకులతో మీటింగ్ ఏర్పా టు చేసి వారి సంగతి ఏమిటో తేలుస్తాం.