కొవిడ్ బారిన పడ్డ సిబ్బందికి రూ.3 వేల సాయం
ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు చర్యలు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : కొవిడ్ సమస్యతో బాధపడుతున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ వెంకటేశ్వర్లు అండగా ని లుస్తున్నారు. కరోనా సోకిన పోలీసులకు రూ.3 వేల నగదుతో పాటుగా డ్రైఫ్రూట్స్, పండ్లు అందజేస్తున్నారు. పోలీసు సంఘం సభ్యులు నిబంధనలు పాటిస్తూ ఆయా కుటుంబ సభ్యులను కలిసి వారికి జాగ్రత్తలతోపాటు ధైర్యం చెప్పి పండ్లను పంపిణీ చేస్తున్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. సిబ్బందికి ఎటువంటి సాయం కావాలన్నా తనకు ఫోన్ చేయాలని స్వయంగా ఎస్పీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే టీకా తీ సుకున్న నేపథ్యంలో సిబ్బందికి కొవిడ్ తీ వ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నదన్నా రు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా హోం క్వారంటైన్లో ఉండాలని ఎస్పీ సూచించా రు. పలువురు సిబ్బంది ఇండ్లకు వెళ్లి వారి ని పరామర్శించడంతోపాటు నగదును పో లీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, పోలీసులు అందిస్తున్నారు.