నిత్యం పెరుగుతున్న ఇంధనం ధరలు
రూ.100కు చేరవలో లీటర్ పెట్రోల్..
కొవిడ్ విపత్తులోనూ ప్రజలపై అధిక భారం
సామాన్యుడి నడ్డీ విరుస్తున్న కేంద్రం
మహబూబ్నగర్, మే 31 : కొవిడ్ మహమ్మారితో జనజీవనం అతలాకుతలమవుకున్నది. ఏ డాది కాలంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ కుదేలవుతున్నాయి. పెదలు కడుపు నిండా తిండి తినడమే గగనమైంది. దురదృష్టవశాత్తు కరోనా సోకితే వైద్యం కోసం డబ్బులు చెల్లించుకోలేని దుస్థితి నెలకొంది. పెరిగిన ఔషధాలు, వైద్య పరికరాల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. కనీసం ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో మోదీ ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలే భారం అనుకోకుండా ప్రజలకు టీకాలు అందిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితిల్లోనూ కేంద్రం దొంగ దెబ్బ కొడుతున్నది. చరిత్రలో రికార్డు స్థాయిలో గడిచిన వారం రోజులు గా పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
కనికరం లేని కేంద్ర సర్మార్..
కరోనా కారణంగా పొట్ట కూటి కోసం బతికే కుటుంబాలు కనీసం ఉపాధి లేక విలవిల్లాడుతున్నాయి. మానవతావాదులు కడుపు నిండా తిం డి పెడుతుండడంతో పేదలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆపన్నహ స్తం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎలాంటి సాయం చేయడం లేదు. పైగా ఉచిత సలహాతో రాష్ట్ర ప్రభుత్వాలకు పూటకో సూ చనలు చేస్తూ ఆగం పట్టిస్తోంది. దేశ ప్రజలపై కనికరం లేకుండా ఇంధన ధరలను సైతం భారీగా పెంచుతున్నది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తటస్థంగా ఉన్న ధరలు కాస్త ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియడంతో మరోమారు పైసా చొప్పున దొడ్డి దారి లో పెంచుతూ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.100కు చేర్చింది. ఇష్టానుసారంగా ఇంధన ధరల పెంపుపై ప్రజలంతా తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న ధరల పెంపు నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంధన ధరల ప్రభావం పరోక్షంగా నిత్యావసరాలపైనా పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయంపై పెనుభారం..
ఇంధన ధరల పెరుగుదలతో వ్యవసాయ ఖ ర్చులు కూడా అమాతంగా పెరిగిపోతున్నాయి. గంట సమయం ట్రాక్టర్ దుక్కి దున్నేందుకు య జమానులు రూ.వెయ్యికి పైగానే వసూలు చేస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరలను పరిగణలోకి తీసుకుంటే గంట సమయం వరినాటు వేసేందుకు రూ.1200 నుంచి 1400 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలకు అడ్డూ అదుపులేకపాయే అంటూ మండిపడుతున్నారు.