మహబూబ్నగర్ టౌన్, మే 31 : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు తూము మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలంలో వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా మరమ్మతు పనులను చేపడుతున్నారు. ప్రధానంగా చెరువు తూము మరమ్మతుపై అధికారులు దృష్టి సారించారు. అలాగే చెరువులో పెరిగిన గుర్రపుడెక్కను తొలగించి పూడికతీత పనులు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. అయితే చెరువులోకి వచ్చే డ్రైనేజీ నీటిని దారి మళ్లించి చెరువును ఖాళీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా వచ్చే వేసవి నాటికి పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా చెరువులోకి మురుగునీరు నేరుగా వ చ్చి చేరకుండా రెండు, మూడుచోట్ల ఫిల్టర్బెడ్లను ఏర్పాటు చేసి చెరువులోకి నీటిని వదిలితే బోటింగ్కు ఎంతో ఆహ్లాదకరంగా ఉండనున్నది. ఇప్పటి కే చెరువు కాల్వను పూడిక తీసి సిద్ధం చేశారు. సో మవారం భగీరథ కాలనీ, శివశక్తినగర్, పాతపాలమూరు మీదుగా తాటికొండ చెరువు వరకు ఉన్న కాల్వలో మున్సిపల్ అధికారులు పూడికతీత పను లు చేపట్టారు. కాల్వను ఆక్రమించిన వారు పనులను అడ్టుకుంటే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.