కందనూలు: గత నెల 23వ తేదిన నిర్వహించిన మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వ హించిన రాత పరీక్షల ఫలితాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 149మంది పరీక్ష రాయగా 31 మంది అర్హత సాధించారన్నారు.
అర్హత సాధించిన వారికి మౌఖిక పరీక్షలు త్వరలో నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యనందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన మైనార్టీ గురుకులాలు అంచెలంచెలుగా ఎదుగుతున్నాయని ప్రభుత్వం విద్యపై చాలా బడ్జెట్ను కేటాయించిందని అన్ని వసతులను కేటాయించిందని అధ్యాపుకులు వాటిని సద్వినియోగ పరిచి విద్యార్థు లకు నాణ్యమైన విద్యనందించాలని వారు కోరారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను కలెక్టర్రేట్ కార్యాలయంలోని నోటిస్ బోర్డుపై ఉంచామన్నారు. కార్యక్ర మంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి అనిల్ ప్రకాశ్, డీఎల్సీవో హవీలారాణి, మైనార్టీ విజిలెన్స్ అధికారి జమీర్ అహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.