తెలకపల్లి: పార్టీ ప్రతిష్టకు అంకితభావంతో పని చేయాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా ఈదుల నరేందర్రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలం లోని టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హైదరాబాద్కు వెళ్లి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ఈదుల నరేందర్రెడ్డిని, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులును శాలువాలు కప్పి, పూల బోకెలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రతిష్ట కోసం త్రికరణ శుద్ధిగా పని చేసే వారికి మంచి పదవులు లభిస్తాయని తెలిపారు.
ఎందరో సామాన్యమైన కార్యకర్తలు పార్టీకి చేసిన సేవలను గుర్తించి మంచి పదవులు వరించాయని పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుతో పాటు ఇతర విభాగాల మండల అధ్యక్షులు, కార్యదర్శులు మిగతా నాయకులంతా పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బంగారయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.