నాగర్ కర్నూల్: జిల్లాలోని అచ్చంపేటలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డ్యూటీ డాక్టర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే తక్షణం స్పందించిన మంత్రి హరీశ్ రావు.. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడడం అందరి బాధ్యత అన్నారు. కోవిడ్ పాజిటివ్తో ప్రసవానికి వచ్చిన మహిళకు ప్రభుత్వాసుపత్రిలో ఖచ్చితంగా ప్రసవం చేయాలని డాక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.