మహబూబ్నగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జడ్చర్ల పట్టణానికి చెందిన రమేశ్కు రెండేండ్ల కిందట ప్రభు త్వ ఉద్యోగం వచ్చింది. ఐదంకెల జీతం వస్తున్నది. అయి తే ఉద్యోగం రావడానికి ముందు రమేశ్కు బీపీఎల్ కింద ఇచ్చిన రేషన్ కార్డును ఇంకా తన వద్దే ఉంచుకున్నాడు. నెలనెలా బియ్యం తీసుకోకపోయినా రేషన్కా ర్డు మాత్రం ఇంకా సరెండ ర్ చేయలేదు. అలాగే నారాయణపేటకు చెందిన మోహ న్ కంది పప్పు వ్యాపారం చే స్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఏడాదికి రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నది. రేషన్ దుకాణం నుం చి తెచ్చుకున్న బియ్యం తినే పరిస్థితి లేదు. కానీ తాను నిరుపేదగా ఉన్నప్పుడు తీసుకున్న రేషన్ కార్డును మాత్రం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలే దు. ఇలా ఒక్క రమేశ్, మోహన్ మాత్ర మే కాదు.. అనేక మంది ఆర్థికంగా బాగు న్నా రేషన్ కార్డులను వదలుకోవడం లేదు. ఇందులో చాలా మంది రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా ముందుకు రారు. అయితే, కొందరు మాత్రం డీలర్తో మాట్లాడి రేషన్ బియ్యం అక్కడే విక్రయించి డబ్బులు తీసుకుంటున్నారు. కాగా, సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇచ్చిన పిలుపు అందరినీ ఆలోచింపచేస్తున్నది. దీనిపై విస్తృతమైన చర్చకు ఆ పిలుపే నాందిగా కనిపిస్తున్నది.
పిలుపునకు స్పందన..
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి హాజరై ఆర్థికంగా స్థోమత ఉన్న వారు రేషన్ కార్డులు వదులుకోవాలని పిలుపునిచ్చారు. అలా వదులుకుంటే ప్ర భుత్వం అర్హులైన మరికొందరికి రేషన్ కార్డులు అందిస్తుందన్నారు. లబ్ధిదారులైన రాజాపూర్ సర్పంచ్ బచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు శ్రీశైలం యాదవ్, నరహరి, నర్సింహులు, దేవేందర్ వెంటనే స్పందించి తమ కార్డులు సరెండర్ చేసేందుకు స్టేజీ మీదే అంగీకారం తెలిపారు. వీరి కార్డుల వివరాలను తాసిల్దార్కు చెప్పారు. కార్డులను డేటాబేస్ నుంచి తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వారిని ఎమ్మెల్యే అభినందించారు.
అవసరం లేని వాళ్లు తిరిగివ్వాలి..
ఒకప్పుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వాళ్లు, నిరుపేదలు రేషన్ కార్డులు పొందారు. అయితే వారిలో కొందరికి ఉద్యోగాలు రావడమో.. ఆర్థికంగా బాగు పడడమో జరిగింది. మరికొందరు అన్నీ ఉన్నా కార్డులు పొందారు. ఇంకొందరు కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు వర్తించవేమో అనే ఉద్దేశంతోనూ తమ వద్దే ఉంచుకుంటున్నారు. అయితే వీరు నెలనెలా చౌ కధర దుకాణానికి వెళ్లి రేషన్ తీసుకోవడం లేదు. ఇక మరికొందరైతే రేషన్ డీలర్తో మాట్లాడి బియ్యం బదులుగా డబ్బులు తీసుకుంటున్నారు. చౌకధర బియ్యం తినడానికి ఇష్టం లేని వారు కూడా రేషన్ కార్డులు ఇంకా తమతో ఉంచుకోవడం ఎంతవరకు స బబో ఆలోచించాలని సామాజికవేత్తలు అం టున్నారు. అవసరం లేని వారు ప్రభుత్వానికి అప్పగిస్తే రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ చెప్పే అవకాశం ఏర్పడుతుంది.
స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
ఆర్థికంగా బాగున్న వారికి రేషన్ కార్డులు ఎందుకు..? వారు ఆ బియ్యం తినే పరిస్థితి లేదు. రేషన్ దుకాణాలకు కూడా రారు. ఇలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్డులను ప్రభుత్వానికి అప్పగించాలి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడొచ్చు. రేషన్ కార్డుల పంపిణీలో రాజాపూర్లో ఇచ్చిన పిలుపు మేరకు ఆర్థికంగా బాగున్నవారు రేషన్ కార్డులను వదులుకున్నారు. వీరిని చూసి మరింత మంది ముందుకు రావాలి. ఒక్క మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో స్టేజీ మీద ఉన్న వాళ్లలోనే ఆరుగురు ప్రకటించారంటే మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంత మంది ఉంటారో ఊహించొచ్చు. ఎవరినీ బలవంతం చేయం. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమకు రేషన్ కార్డు అవసరం లేకుంటే తిరిగి ఇవ్వాలని కోరుతున్నాం.
– డా.సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల