రూ.1,37కోట్లతో ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ
లింగాల: నల్లమల చెంచు పెంటల్లో నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని ఎర్రపెంట గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.1,37 కోట్లతో నిర్మించనున్న 37ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అక్కమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం చెంచు గిరిజనులు వెనుకబాటు తనానికి గురి కాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్డీటీ సంస్థ దేశ వ్యాప్తంగా విస్తరించి చెంచులను చైతన్యవంతులను చేస్తూ వారికి అండగా నిలువడం శుభ పరిణామమన్నారు.
గతంలో చెంచులు అక్షరాస్యతకు దూరమై అడవులకే పరిమితయ్యే వారని ఆర్డీటీ సంస్థ కృషితో చెం చుల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. డిగ్రీ పూర్తి పేదరికంలో ఉన్న గౌరమ్మ అనే బాలిక ఉన్నత చదువుల కోసం జీబీఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఉండగా ఉంటుందన్నారు.
ఐటీడీఏ నిధులతో చేపడు తున్న ఇండ్ల నిర్మాణ పనులు ఆర్డీటీ సంస్థకు బాధ్యతలు అప్పగించడం శుభపరిణామమని, త్వరితగతిన పూర్తి చేయుటకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా నల్లమలలో చెంచు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు సర్వ హక్కులు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు రవిశంకర్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు సుధీర్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయ కులు కేటీ తిర్పతయ్య, మాజీ జడ్పీటీసీ మాకం తిర్పతయ్య, సర్పంచ్లు కోనేటి తిర్పతయ్య, శేషయ్య, పర్వతాలు, రవీందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటగిరి, చెంచు నాయకులు సన్నయ్య, గోవిందు, ఆర్డీటీ సంస్థ ఏరియా టీం లీడర్ సుధాకర్ పాల్గొన్నారు.