కొల్లాపూర్: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తం అని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామానికి చెందిన అర్జునయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ2లక్షల చెక్కు, వరిదేలకు చెందిన వెంకటేశ్వర్లుకు రూ60వేలు చెక్కులను శనివారం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదని, కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య చికిత్స పొందేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, కుడికిళ్ల ఎంపీటీసీ కొండ్ర బుచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రావు, గాలి యాదవ్, మొట్టె కుర్మయ్య, కుబేరుడు, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.