కొల్లాపూర్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుందని అర్హులైన వారు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఆయన కార్యకర్తలతో కలిసి పర్యటించారు.
పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతు న్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో ప్రజలడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమా ధానం చెబుతూ గ్రామంలో పర్యటించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. అర్హులైన వృద్దులు, భర్త చనిపోయిన మహిళలు, ఒంటరి మహిళలు, వికలాంగులు దరఖాస్తుచేసుకోవాలన్నారు. ప్రభు త్వం ప్రతి గ్రామంలోనూ సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నదన్నారు.
గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి నేడు సీఎం కేసీఆర్ పాలనలో కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదన్నారు. రైతులకు, రైతుకూలీలకు, కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు, పేదింటి ఆడపడుచులకు ఇలా ఎందరికో సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈయన వెంట ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులున్నారు.