కొల్లాపూర్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామ ఇన్చార్జి జక్కుల వెంకటస్వామి, వార్డు సభ్యులు, మరో 30మంది టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో వారందరికి ఎమ్మెల్యే బీరం గులాబీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్తోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కోడేరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సూర్య, రాజశేఖర్గౌడ్, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిషన్నాయక్, సింగిల్ విండో చైర్మన్ రుక్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సురేశ్రెడ్డి, విష్ణువర్దన్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు.