వంగూరు: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్తో అడ్డంగా సంపాదిస్తున్న దుర్మార్గుడని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ మండి పడ్డారు. శనివారం వంగూరులో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ అదే ఆర్టీఐని వాడుకుని నీ భరతం పడతామని హెచ్చరించారు.
గజ్వేల్ సభలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన నీకు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్లపై అనవసరమైన ఆరోపణలతో బూతు పురాణం వాడితే సరైన గుణ పాఠం చెప్పక తప్పద న్నారు. దమ్ముంటే మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. చంద్రబాబు బినామీగా తెలంగాణలో వ్యవహారి స్తున్న నీకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు.
వంగూరు మండలంలోని నీ స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికే ఏమి చేయలేని నీవు రాష్ర్టానికి ఏం చేస్తావని ఎద్దేవా చేశారు. నీ వ్యవహార శైలి నచ్చక మీ పార్టీ సీనియర్ నేతలే రావడం లేదనేది గర్తించుకోవాలన్నారు. మునిగిపోయే కాంగ్రెస్ నావని మరింత ముంచుతావని ఆయన హితవు పలికారు. రాజకీయ విలువలు కాల రాస్తున్న నీకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఎత్తడానికి హాక్కు లేదన్నారు. ఇప్పటికైనా నోరు అదు పులో పెట్టుకోకపోతే తగిన రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నేతలు పాల్గోన్నారు.