కందనూలు: అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. ఆదివారం వారు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ హల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృధ్ధులు శాఖ ఆధ్వర్యంలో చెపట్టిన ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హజరై మాట్లాడారు.
ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఏ రాష్ట్రంలో లేని వినూత్న పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు. ప్రతి ఒక్కరిని వారి అభిరుచులకు అనుగుణంగా వారికి ఆ రంగంలో రాణిం చేలా పోత్సహిస్తున్నదని నిరుద్యోగులకు ఉద్యోగ అన్వేషణలో ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ఆయా తెగలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి కోచింగ్ ఇవ్వటం ఇలా అనేక ఉనత్న లక్ష్యాలతో ముందుకెళ్తున్న రాష్ట్రం మనదోక్కటే అన్నారు.
ఈ సందర్భంగా వారు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృధ్ధుల శాఖ నాగర్కర్నూల్, అచ్చం పేట, కల్వకుర్తి, కొల్లాపూ ర్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపిక చేసిన దివ్యాంగులకు 23 స్కూటీలు, 6 ల్యాప్ టాప్లు, 5 స్మార్ట్ ఫోన్లు, 2 బ్యాటరీ వీల్ చైర్లు, ఒక సీడీ ప్లేయర్ను వారికి అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇంకా అర్హులైన వారికి మలి విడత కారక్రమం ఏర్పాటు చేసి వారికి అందివడం జరుగు తుందని వారిని ఎంపి క చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కోరారు. సమావేశంలో నాగర్కర్నూల్, అచ్చంపేట మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్, నరసింహా గౌడ్, మార్కెట్ చైర్మన్ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.