కల్వకుర్తి: కులవృత్తుల వారు ఆర్థికాభివృధ్ధి సాధించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీ ఈదుల్ చెరువులో, లింగసానిపల్లి గ్రామ గొల్ల చెరువులో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార కార్మికులతో ఎమ్మెల్యే మట్లాడి వారి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపుని చ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్గౌడ్, టీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు బావండ్ల మధు, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు గణేశ్, కౌన్సిలర్ సూర్యప్రకాశ్, బోజిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు, మత్స్యకార్మికులు పాల్గొన్నారు.