నాగర్కర్నూల్ : అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), లక్ష్మాపురం తండాల్లో కొందరు అనుమతులు లేకుండా పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఆయా గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 900 ప్యాకెట్ల విత్తనాలు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.