కోడేరు: ఆపదలో ఉన్న అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కోడేరులోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం మండలంలోని 46 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ, 13,19,600 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదన్నారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాతలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయన్నారు.
కోడేరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి శక్తి వంచన లేకుండా కృసి చేస్తానన్నారు. కోడేరు మండల కేం ద్రానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన రూ. 30 లక్షల విలువైన నూతన అంబులెన్స్న మంజూరు చేయించానన్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు.
కార్యక్రమంలో కొల్లాపూర్ మర్కెట్ కమిటీ చైర్మెన్ నరేందర్రెడ్డి, కోడేరు సింగిల్ విండో చైర్మెన్ చిన్నారెడ్డి, తాలూకా నాయ కులు పవన్కుమార్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్గౌడ్, రాజవర్ధన్ రెడ్డి, విండో డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్లు శివారెడ్డి, కర్రెమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.