నాగర్ కర్నూలు : దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకు రావడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ఆచరణలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్త అమలులో భాగంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళిత కుటుంబాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలో దళిత కుటుంబాలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఉదయ్, ఎంపీ రాములు, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ ,గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశి రెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రతి దళిత బిడ్డ ఆర్థికంగా నిలదొక్కు కోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎంపీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.