నాగర్కర్నూల్: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన ఆర్థిస సాయాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యే అంద జేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది మెరుగైన వైద్య సేవలు పొందేందు కు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా ప్రజలకు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హన్మంత్రావు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీ.సీ రోడ్డు పనులు ప్రారంభం
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో 25 లక్షలతో చేపట్టనున్న నల్లవెల్లి రోడ్డు నుంచి శ్రీపురం రోడ్డు వర కు నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించా రు. అదేవిధంగా ప్రధాన రహదారిలోగల నల్లవెల్లి చౌరస్తాలో చేపడుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు నాణ్య తగా చేపట్టాలని, గుత్తేదారుకు సూచించారు.
అంతకు ముందు మండలంలోని గుడిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శిం చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్కమిటి చైర్మన్ కుర్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, జడ్పీటీసీ చిక్కొం డ్ర శ్రీశైలం యాదవ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఈశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ బాబురావు, కమిషనర్ అన్వేశ్, వార్డు కౌన్సిలర్ జక్కా రాజ్కుమార్రెడ్డి, సుబ్బారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.