చారకొండ: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్ధికాభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోగా అందులో అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలు కలిసి ఉన్న చారకొండ మండలం ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం చారకొండ మండల కేంద్రంలో దళిత బంధు పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ముందుగా చారకొండలో ప్రధాన రహదారి గుండా దళితులు, మహిళలు డప్పులు వాయిద్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభు త్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయి తిరుమల ఫంక్షన్లో హాల్లో ఏర్పాటు చేసిన దళిత బంధు పథకంపై ఎంపీపీ నిర్మలావిజేందర్గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర సీఎం ఆలోచించని విధంగా తెలంగాణ సీఎం కేసీఆ ర్ దళితోద్ధారణ కు కంకణం కట్టుకున్నారన్నారు. 70 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో దళితులు అన్ని రంగాలో వెనుకబడి ఉన్నారని గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకంతో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తున్నారన్నారు. దళితులు వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ వారి కాళ్లపై వాళ్లు నిలబడే విధంగా సీఎం కేసీఆర్ గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఎన్నికల కోసమే దళిత బంధు ప్రకటించారని ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. దళితులు, గిరిజనులపై ప్రేమ ఉన్నట్లు డ్రామాలు చేస్తూ కుర్చీల కోసం ప్రతిపక్షాలు తహతహాలాడుతు న్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలకు కాలం చెల్లిందని వారు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ దళితులు దుర్భరమైన జీవితాలు గడిపారని సీఎం కేసీఆర్ దళిత బాంధవుడిగా ఉం టూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, సీఎం కేసీఆర్కు దళితులు జీవితాంతం వెంటుండి వారి రుణం తీర్చుకోవాలని అన్నారు. క లెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ త్వరలోనే దళిత బంధు పథకంలో మండల స్థాయిలో టీంలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి పథకం వ ర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దళితులు ఈపథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.
కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్, చారకొండ సర్పంచ్ విజేందర్గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు గజ్జె యాదయ్య, వైస్ ఎం పీపీ బక్కమ్మ యాదవ్, ఎంపీటీసీలు శ్రీనివాస్రెడ్డి, గ్యార లక్ష్మణ్, లక్ష్మణ్నాయక్, లలితాబాల్సింగ్, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, మండల కోఆప్షన్ సలీం, అధికారులు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, దళితులు, మహిళలు పాల్గొన్నారు.