అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అచ్చంపేట మండలం సిద్ధాపూర్ క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. మృతులను అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన శేఖర్ దంపతులుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.