వెల్దండ/నాగర్కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటుపై పర్యావరణ అనుమతుల విషయంలోరాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ తెలిపారు. మంగళవారం ఉదయం ఏవీఆర్ ఫంక్షన్ హాల్ వెల్దండలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఎనిమిది మండలాల నుంచి రైతులు వచ్చి ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో పర్యావరణానికి సంబంధించిన తమ అభిప్రాయాలను తెలియజేసారు. రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వెలుబుచ్చిన వారి అభిప్రాయాల వీడియోలు రికార్డింగ్ చేశామననారు. వీటితో పాటు కొందరు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వారి అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
అంతకన్నా ముందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, ప్రజలకు కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీరు డి. సంగీత లక్ష్మి ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండో ఫేజ్ కెనాల్ ఏర్పాటు ఆవశ్యకత, అందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా లాభాలు, ప్రాజెక్ట్ ఏర్పాటు వళ్ల ఏర్పడే పర్యావరణ నష్టం తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ పై తెలుగులో, ఆంగ్లంలో పూర్తి వివరాలు గణాంకాలతో సహా వివరించారు. కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ డి. కృపానంద్, ఎస్ఈఈ జి.హన్మంత్ రెడ్డి, ఏఈఈ డి.సంగీత లక్ష్మి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : దమ్మన్నపేటలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ