నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తాకు మాజీ మంత్రి, దివంగత మహేంద్రనాథ్ చౌరస్తాగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామకరణం చేశారు. అనంతరం మహేంద్రనాథ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బైకని శ్రీనివాస్ యాదవ్, వాల్యా నాయక్, ప్రముఖ కవి, గాయకుడు సాయి చంద్ తో కలిసి భూమిపూజ చేశారు.