అచ్చంపేట: పట్టణంలోని మధురానగర్లో రూ. 50లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారం భించారు. మధురానగర్ నుంచి ఆదర్శనగర్ కాలనీలోని చైతన్య కళాశాల వరకు నూతన డ్రైనేజీని గువ్వల బాలరాజు మంజూరు చేయించారు. పట్టణంలో మొత్తం రూ. 4 కోట్లతో డ్రైనేజీ పనులు మంజూరు చేయించారు. అందులో భాగంగా రూ. 50లక్షలతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేవిధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
మున్సిపల్ నూతన పాలకవర్గం బాగా పని చేస్తున్నదని ఎక్కడ ఏ సమస్య ఉన్న వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, సిబ్బంది, కౌన్సిలర్లను అభినందించారు. పార్టీలకతీతంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నర్సింహాగౌడ్, వైస్ చైర్మెన్ శైలజరెడ్డి, కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు సుగుణమ్మ, రమేశ్రావు, గడ్డం రమేశ్, సోమ్లానాయక్, నాయకులు, కాలనీవాసులు శ్రీనివాసచారి, బీమయ్య, మన్నాన్, చంద్రు, శ్రీరాం, జగపతిరావు, రామకృష్ణ, ఏఈ మేఘనాథ్, మంగ్యానాయక్, జైపాల్నాయక్, ఉస్సేన్, ఖలీల్, రాజు పాల్గొన్నారు.