అచ్చంపేట: సాంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా సైనికుడిగా పని చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం నందు అన్ని మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ కమిటీల నిర్మాణం, అనుబంధ కమిటీల నియామకం, మండల కమిటీల ఎన్నికపై చర్చించారు. మండలాల వారీగా కమిటీల నియామకంపై మండల బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 17న పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్ నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండల కమిటీల ఎన్నిక ఉంటుందని తెలిపారు.
డివిజన్లోని ఆరు మండలాల పరిధిలోని అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండల కమిటీల ఎన్నిక ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు బల్మూర్ మండల కమిటీ ఎన్నిక, 11గంటలకు ఉప్పునుంతల మండలం, 12 గంటలకు లింగాల మండలం, 2గంటలకు అచ్చంపేట మండలం, 3 గంటలకు పదర మండలం, 4 గంటలకు అమ్రాబాద్ మండల కమిటి సమావేశం ఉంటుందన్నారు. కేటాయించిన సమయానికి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బాధ్యులు హాజరుకావాలని సూచించారు. మండల కమిటీల వరకు ఎక్కడైనా మిగిలిన అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని, కమిటీలోని సభ్యుల ఫోన్ నెంబర్లు తప్పకుండా ఉండాలని అన్నారు.
పార్టీని మరింత బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలపై ఉందన్నారు. కమిటీల నియామకంలో గ్రామాలలో నెలకొన్న పార్టీ పరిస్థితి, సమస్యలపై ఆరా తీశారు. అందరు సమన్వయంతో పనిచేసి మండలాల వారిగా గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను పూర్తి చేయడం పట్ల అభినందిం చారు. ఇదే ఓరవడితో కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపతేం చేయాలన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మెన్ సీఎంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ తులసీరాం, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీలు ప్రతాప్రెడ్డి, రాంబాబు, లక్ష్మమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు నర్సయ్యయాదవ్, సురేందర్రెడ్డి, రాజీరెడ్డి, సర్పంచ్ లోక్యనాయక్, మండల రైతు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి, చుక్కారెడ్డి, పర్వతాలు, సుల్తాన్, కౌన్సిలర్లు అప్పశివ, రమేశ్రావు, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.