జెడ్పీచైర్పర్సన్ పద్మావతి
ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటించాలి
నాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీచైర్పర్సన్
పెంట్లవెల్లి, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునర్ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రతిఒక్క పాఠశాలను పండుగ వాతావరణంలో ప్రారంభించాలని జిల్లాపరిషత్ చైర్పర్సన్ పద్మావతి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల, 1వ అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పునర్ప్రారంభానికి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. కొవిడ్ నింబంధనలు పాటిస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను నిర్వహిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉపాధ్యాయులు జెడ్పీచైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆమె పాఠశాల గదులను పరిశీలించి తన నిధుల నుంచి రూ.5లక్షలు మంజూరు చేశారు. పాఠశాల దుస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి నూతన గదులు నిర్మించడానికి కృషిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సహకారంతో పాఠశాలల్లో ప్రస్తుతం 3గదులు నిర్మాణంలో ఉన్నాయని ఉపాధ్యాయులు జెడ్పీ చైర్పర్సన్కు తెలిపారు. అంతకుముందు పాఠశాల ఉపాధ్యాయులు జెడ్పీచైర్పర్సన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
నాయకులకు రాఖీ కట్టిన జెడ్పీచైర్పర్సన్
ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వచ్చిన జెడ్పీచైర్పర్సన్ పద్మావతి జెడ్పీటీసీ చిట్టెమ్మ నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హన్మంతు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేందర్గౌడ్, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ జాఫర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ చిట్టెమ్మ తమ ఇంటికి వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్కు సంప్రదాయం ప్రకారం చీరను అందించి మిఠాయి తినిపంచారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎంపీపీ ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ చిట్టెమ్మ, జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, సర్పంచు సువర్ణమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హన్మంతు, నాయకులు సురేందర్గౌడ్, రాజేశ్, జాఫర్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఉపాధ్యాయులు బలరామకృష్ణారావు, నర్సింహ, శ్రీనివాసులు, శ్రీధర్ తదితరులు ఉన్నారు.