ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, జూలై 21: రాష్ట్రంలోని పేదలకు సీఎం సహాయనిధి పథకం భరోసాలాంటిదని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధ్దిదారులకు బుధవారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదన్నారు. నిరుపేదలను ఆపదలో ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని పేదలకు కోట్లాది నిధులు అందజేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ సాయం అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేదల కోసం ఏదీ కావాలన్న అడగకముందే పథకాలు రూపకల్పన చేసి ఆదుకుంటున్నారన్నారు. పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీలు ప్రతాప్రెడ్డి, రాంబాబు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, సర్పంచ్ రవిశంకర్, సింగిల్విండో చైర్మన్ ఆనంద్రెడ్డి, మాజీ ఎంపీపీ పర్వతాలు, సర్పంచ్ లోక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మసీదు పునర్నిర్మించాలని వినతి
అచ్చంపేట రూరల్, జూలై 21: పట్టణంలోని జామేమసీదు పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని మసీదు కమిటీ ఆధ్వర్యంలో విప్ గువ్వల బాలరాజుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. బుధవారం బక్రీద్ సందర్భంగా మసీదు వద్ద ముస్లింలను కలిసేందుకు వచ్చిన విప్ గువ్వలను మర్యాదపూర్వకంగా కలిశారు. మసీదు నిర్మాణం పనులు మధ్యలో ఆగిపోయినట్లు విప్ గువ్వల దృష్టికి తీసుకెళ్లారు. పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన విప్ గువ్వల పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు భరోసానిచ్చారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు సిద్ధ్దిఖ్, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.