హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూపీఎస్ అప్గ్రేడేషన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిని గచ్చిబౌలిలోని టీఎస్ఐఐసీ సెంటర్లో ఉన్న స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ) నిర్వహిస్తున్నది. ఎస్డీసీలో 2011 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దానిలోని యూపీఎస్ (సర్వర్లు)లు పాతవి కావడంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అవి పనిచేయడం లేదు. ఈ కేంద్రంలో ఉన్న పవర్ బ్యాకప్ వ్యవస్థ సరిపోవడం లేదు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పుడల్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్డీసీలోని యూపీఎస్లను మార్చాలని, ఇతర వ్యవస్థలను ఆధునికీకరించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి రెండ్రోజులు మరమ్మతులు చేయనున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వెబ్సైట్లు, ఎస్డీసీకి అనుబంధంగా ఉన్న ఇతర ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు.