సూర్యాపేట రూరల్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల, పట్టణాల రూపు రేఖలు మారుతున్నాయని సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం, రాజానాయక్తండా, లక్ష్మీతండాల్లో పల్లెప్రగతిని బుధవారం ఆయన పరిశీలించారు. రామన్నగూడెంలో మురుగు కాల్వ నిర్మాణ పనులు, రాజానాయక్తండాలో సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, వైస్ ఎం పీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచులు కత్తుల మల్లయ్య, లూనావత్ అశోక్, లూనావత్ సూర్యనాయక్, ఎంపీటీసీ లూనావత్ శాంతాబాయి పాల్గొన్నారు.
సూర్యాపేటలో.
బొడ్రాయిబజార్ : పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేటలోని 4, 17, 14, 28, 39 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మొక్కలు నాటి మాట్లాడారు. ఖాళీ ప్లాట్లు, కాలువల్లో చెత్త వేయడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. ఏడురోజులుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయడంతో పాటు కాల్వల్లో పూడిక తీశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు చింతలపాటి భరత్మహాజన్, రాపర్తి శ్రీనివాస్గౌడ్, మొరిశెట్టి సుధారాణి, లక్ష్మీమకట్లాల్, సుమిల, డీఈ సత్యారావు, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, అన్నెపర్తి రాజేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సా రగండ్ల శ్రీనివాస్, నాయకులు బైరు వెంకన్నగౌడ్, కక్కిరేణి నాగ య్య, బైరు దుర్గయ్య, మొయినొద్దీన్, రాచకొండ దేవయ్య, సైదులు పాల్గొన్నారు.
ప్రతిఇంట్లోనూ ఆరు మొక్కలు నాటాలి
చివ్వెంల : ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్ అన్నారు. మండలంలోని పాచ్యానాయక్ తండాలో గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ గోపి కార్యదర్శి మధు పాల్గొన్నారు.
కంపచెట్ల తొలగింపు
ఆత్మకూర్.ఎస్: మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు, పిచ్చి మొక్కలను తొలగించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో..
తిరుమలగిరి/నాగారం/తుంగతుర్తి : నియోజక వర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, పారిశుధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టారు. మొక్కలు పంపిణీ చేశారు. తిరుమలగిరి మండలం కోక్యానాయక్తండాకు జేసీబీతో మట్టిరోడ్డును వేశారు. తిరుమలగిరిలో డ్రైనేజీ కాల్వలను శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి తిరుపతయ్య, ఎంపీడీఓ ఉమేశ్ చారి, మున్సిపల్ చైర్మన్ రజిని, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ పాల్గొన్నారు. నాగారం మండలంలో ఎంపీపీ కూరం మణి, ఎండీఓ శోభారాణి, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, ఏపీఓ శేఖర్రావు, ఏఈ సతీశ్, పీఆర్ఏఈ శ్రీనివాస్, ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తుంగతుర్తి మండలంలో మం డల ప్రత్యేకాధికారి రామారావు, ఎంపీడీఓ లక్ష్మి, తాసీల్దార్ రాంప్రసాద్, డిప్యూటీ తాసీల్దార్ పుష్ప, ఎంపీపీ గుండగాని కవిత, ఎంపీటీసీ కేరెడ్డి లతారెడ్డి, సర్పంచులు పాలొన్నారు. నూతనకల్ మండలంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ దామోదర్రెడ్డి, తాసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ ఇందిర పాల్గొన్నారు.