ఆత్మకూరు(ఎం), జూలై7: పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుం టామని డీపీవో సాయిబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, తుక్కాపురం గ్రామాలలోని ప ల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలు, వైకుంఠధామాలను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి లో ప్రజలందరూ భాగస్వాములై గ్రామాభివృద్ధిలో ముందుం డాలన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పాత ఇండ్లను తొలగింపును పరిశీలించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మొరిపిరాలలో పంపిణీ చేసిన మొక్కల వివరాలు సేక రించారు. వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్లు నగేశ్, రాంరెడ్డి, రాజు, ఎంపీటీసీ కవిత, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ ధనలక్ష్మి, ఉపసర్పంచ్ నవ్య, కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, శేఖర్, రమేశ్, నజీమాబేగం, కారో బార్లు కిష్టయ్య, స్వామి పాల్గొన్నారు.
ఇండ్ల కూల్చివేతకు సహకరించండి
ఆలేరు టౌన్ పట్టణంలో పాడుబడ్డ ఇండ్ల కూల్చివేతకు సహక రించాలని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కోరారు. పట్ట ణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారీ వర్షాలకు పాడుబడిన ఇండ్లు కూలితే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండొచ్చనే ఉద్దేశంతో శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగిస్తు న్నామన్నారు. ఇటువంటి ఇండ్లను గుర్తించామని, ఈ విపయ మై ఇండ్ల యజమానులు సహకరించాలన్నారు. ప్రణాళికబద్ధం గా గుర్తించి తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ లావణ్యలత, కౌన్సిలర్లు శమంతారెడ్డి, సునీత, కోఆప్షన్ మెంబ ర్ రాజేశ్, వీబీకేలు ధనలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపు
మోటకొండూర్: పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పలు గ్రామా ల్లోని వైకుంఠధామాలను ఎంపీడీవో వీరస్వామి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో అధికారులు శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొ లగింపజేశారు. సర్పంచ్లు పంచాయతీ సిబ్బందితో పిచ్చి మొ క్కలను తొలగించడం, రోడ్లను శుభ్రం చేయడం, మురికి కాల్వ లను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు చేయించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు, అధికారులు, పంచాయతీ కార్యద ర్శులు గ్రామాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ముమ్మరంగా పనులు
ఆలేరురూరల్: మండలంలోని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం సర్పంచ్లు, వార్డు సభ్యులు కలిసి రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల ను తొలగించారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మీప్రసాద్రెడ్డి, రాంప్రసాద్, న వ్య, మహేందర్రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ
రాజాపేట: పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం మండలం లోని వివిధ గ్రామాల్లో పారిశుధ్య పనులతో పాటు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివా స్రెడ్డి, గోపిరెడ్డి, మధుసూదన్రెడ్డి, రాజు, భాగ్మమ్మ, ధనలక్ష్మి, దేవిరాములునాయక్, విజయకనకయ్య, మమత, పరిమళ, గ్రామ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.