న్యూఢిల్లీ, జూలై 1: డ్రోన్లు ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉండటం భద్రతా సవాళ్లను సంక్లిష్టం చేస్తున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. డ్రోన్ల లాంటి కొత్త తరహా దాడులను నిరోధించడానికి పాత కాలపు ఆలోచన విధానాన్ని వీడాలని, కొత్త యుద్ధ నైపుణ్యాలను, యుద్ధ సామగ్రిని, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జమ్ములో వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి, సైనిక స్థావరాలపై డ్రోన్ల సంచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.