ఢిల్లీ ,జూన్ 20: ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహిమ్ రైసీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ద్వారా అభినందనలు తెలియజేస్తూ… “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహిమ్ రైసీకి అభినందలు”. “ఇండియా-ఇరాన్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు.