నేడు స్వగ్రామమైన వెంకటాపూర్లో అంత్యక్రియలు
సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత
మాక్లూర్, జూన్ 17: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కళ్యాణ్రావు బుధవారం పంజాబ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం వెంకటాపూర్కు చెందిన కళ్యాణ్రావు(23) పంజాబ్ రాష్ట్రంలో బీమండి ప్రాంతంలో టెక్నికల్ విభాగంలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే అధికారులు మిలటరీ బేస్ క్యాంపునకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం మృతదేహాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలిస్తారని, ఆ వెంటనే స్వగ్రామమైన వెంకటాపూర్కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. కళ్యాణ్రావు నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుకు సమీప బంధువు.
ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
ఖలీల్వాడి, జూన్ 17: ఆర్మీ జవాన్ కళ్యాణ్రావు మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం కలిచివేసిందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళ్యాణ్రావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.