కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే కరోనా వలన ఎందరో ప్రముఖులు కన్నమూయగా, మరి కొందరు పోరాడుతూ వస్తున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ నటి కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో కన్నుమూసారు. దీంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది. ఇప్పుడు కవిత భర్తకు కూడా కరోనా పాజిటివ్ అని తేలగా ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కవిత కుమారుడు సంజయ్ రూప్కు కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం ఏ మాత్రం కుదుటపడకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కవిత భర్త దశరథ రాజు ఆరోగ్యం కూడా విషమించినట్టు చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత.. తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు.