సూర్యాపేట : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు నాగారం సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జనకవరం పొంగులూరు మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన పెండ్యాల వీరాంజనేయులు హైదరాబాద్లోని కొంపెల్లిలో నివాసం ఉంటూ బైక్పై గ్రామాలకు వెళ్లి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడగా 35కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
అతడు అందించిన సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్రుపల్లి గ్రామానికి చెందిన హనుమంతరావు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగామ్ మండలంలోని కంచేపల్లి గ్రామంలో నివాసం ఉంటూ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు.
ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి అతడిని పట్టుకొని 431కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి