హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణను రాజ్భవన్లో డీజీపీ కలిశారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్, ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభావకర్ రావు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సీజేఐని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నేర న్యాయ వ్యవస్థలోని వేర్వేరు స్టేక్ హోల్డర్స్ మధ్య సమన్వయంపై చర్చ జరిగిందని అధికారిక ప్రకటన తెలిపింది.