హైదరాబాద్ : వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రూ .15 లక్షల వ్యయంతో దాతల సహాయంతో ఈ నూతన కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయబడిందని, ప్రజలను కలవడానికి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందని సీపీ అన్నారు. దాతలు శ్రీనివాస కన్స్ట్రక్షన్, ఆదిత్య హోమ్స్, గ్రీన్ కో, అపర్ణ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్స్ కు మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.