న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారత్ చైర్మన్ రాజేశ్ నంబియార్ డిజిటల్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న మాల్కం ఫ్రాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన రిటైర్ కానున్నారు.
మాల్కం ఫ్రాంక్ స్థానంలో రాజేశ్ నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 సెప్టెంబర్ ఒకటో తేదీన కాగ్నిజెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కం డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మాల్కం ఫ్రాంక్ రిటైర్ అవుతున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
మాల్కం ఫ్రాంక్ స్థానే రాజేశ్ నంబియార్ను నియమిస్తున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. అలాగే సంస్థ భారత్ విభాగం చైర్మన్గానూ కొనసాగుతారని జూన్ 4వ తేదీన వెల్లడించింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రిటైరయ్యే వరకు మాల్కం ఫ్రాంక్ సంస్థ సీఈవోగా కొనసాగుతారు.
రాజేశ్ నంబియార్ ఇంతకుముందు నెట్వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ కెయినా నుంచి కాగ్నిజెంట్లో చేరారు. అంతకుముందు ఐబీఎం, టీసీఎస్ల్లోనూ సేవలందించారు.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…