పట్నా : మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించి ఎలక్ట్రిక్ స్తంభానికి వేలాడదీసిన దారుణ ఉదంతం బిహార్ లోని సమస్తిపూర్ జిల్లా రుధియా గ్రామంలో వెలుగుచూసింది. ఆ ప్రాంతంలోని మరుగుదొడ్డికి మహిళ రాగా దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. లైంగిక దాడి అనంతరం తీవ్రంగా హింసించిన దండగులు గ్రామంలోని విద్యుత్ స్తంభానికి ఆమెను వేలాడదీయగా బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుధియా గ్రామంలో మంగళవారం ఉదయం బహిరంగ మరుగుదొడ్డికి మహిళ రాగా ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
అర్ధనగ్నంగా దయనీయ పరిస్థితుల్లో రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం వద్ద మహిళ పడిఉండటాన్ని గుర్తించిన స్ధానికులు హుటాహుటిన ఆమెను సమీప దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉందని వైద్యలు తెలిపారు. మరోవైపు బాధితురాలి ఇంటి వద్ద పెండ్లి వేడుకలు జరుగుతుండటంతో అక్కడ పలువురు కూలీలు టెంట్లు వేస్తుండటంతో మహిళపై వీరే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.