శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్లో సినిమా వస్తుందంటే తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత ప్రభుదేవా- ఎంఎస్ రాజు కాంబినేషన్లో పౌర్ణమి అనే చిత్రం రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి.
2006లో వచ్చిన పౌర్ణమి సమయంలో ఏర్పడ్డ గొడవల గురించి ఇంత వరకు క్లారిటీ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఎంఎస్ రాజు. ప్రభుదేవాకు నాకు గొడవలు అయ్యాయని వచ్చిన వార్తలలో వాస్తవం లేదు. ప్రభుదేవా మంచి పొజీషన్లో ఉన్నందుకు సంతోషిస్తాను. అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. దీంతో 15 ఏళ్లుగా ఉన్న రూమర్కి చెక్ పడింది. కాగా, గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.