పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెస్టుల్లోకి ఆలస్యంగా వచ్చిన రోహిత్ మొదట లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చాడు. తర్వాత ఓపెనర్గా విజయవంతమయ్యాడు. న్యూజిలాండ్తో ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు తలపడాల్సి ఉంది. ఫైనల్ అనంతరం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఐదు టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది.
ఇంగ్లీష్ గడ్డపై రోహిత్కు మరో కఠిన సవాల్ ఎదురుకానుంది. తన టెస్టు కెరీర్లో బహుశా ఇదే కష్టతరమైన పర్యటన కావొచ్చు. ఈ నేపథ్యంలోనే రోహిత్కు కెరీర్ తొలినాళ్లలో కోచ్గా వ్యవహరించిన దినేశ్ లాడ్..భారత ఓపెనర్ రోహిత్కు విలువైన సలహాలతో పాటు సూచనలు చేశాడు. ఇంగ్లాండ్లో రోహిత్ విజయవంతం అవుతాడని చెబుతున్న దినేశ్.. తన బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఓపికగా ఉండాలని సూచించాడు.
ఓపెనర్గా శుభారంభాలు అందిస్తూనేపెద్ద ఇన్నింగ్స్లు ఆడాలని కోరాడు. ఇంగ్లాండ్ పిచ్లపై పెద్ద స్కోర్లు సాధించడం చాలా ముఖ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పాడు. ‘ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానం అందరి దృష్టిని ఆకర్షించిందన్నాడు. పేసర్లను ఎదుర్కొనేటప్పుడు షాట్లను సులభంగా ఆడాడు. కొన్ని ఇన్నింగ్స్ల్లో ఈజీగా ఔటైనప్పటికీ ఈసారి అలాంటి తప్పిదాలు చేయడని’ చిన్ననాటి కోచ్ లాడ్ తెలిపాడు.
ఏడేండ్ల తర్వాత ఇంగ్లాండ్లో రోహిత్ మొదటి టెస్టు ఆడబోతున్నాడు. అతడు చివరిసారిగా 2014లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఐతే 2019లో టెస్టు ఓపెనర్గా అవతరించినప్పటి నుంచి రోహిత్ మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ గడ్డపై రాణించాలనుకుంటున్నాడు. ఈ టూర్ కోసమే సన్నద్ధమవుతున్నాడు.