న్యూఢిల్లీ, మే 23: టీకాల కొనుగోలులో భారత ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్టు గగన్దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో టీకాలు దొరికే పరిస్థితి లేదని చెప్పారు. ‘ఇతర దేశాలన్నీ రిస్క్ చేసి ఏడాదికి సరిపడా వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఇప్పుడు వ్యాక్సిన్ కొనుగోలుకు ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతాయి’ అంటూ ప్రశ్నించారు. ‘టీకా ఉత్పత్తి పెంచడానికి చేయగలిగినంత చేయాలి. అలాగైతేనే ఎక్కువ టీకాలను సమకూర్చుకోగలం’ అని పేర్కొన్నారు.