న్యూఢిల్లీ: కరోనా వైరస్తో తన భర్తను కోల్పోయిన జాతీయ కబడ్డీ క్రీడాకారిణి తేజస్విని భాయికి కేంద్ర క్రీడాశాఖ అండగా నిలిచింది. కుటుం బ పెద్దను కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న తేజస్వినికి క్రీడాశాఖ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసింది. పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్లు క్రీడాశాఖ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ‘కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. మంజూరైన మొత్తాన్ని నా కూతురు భవిష్యత్ కోసం ఉపయోగిస్తా’ అని తేజస్విని భావోద్వేగంగా అంది.