గజ్వేల్ అర్బన్, మే 20 : కరోనా బాధితులకు అండగా పలువురు గజ్వేల్ పట్టణంలో సేవలందిస్తున్నారు. భోజనం వండుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి భోజనం తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన నాచారం ఆలయ బోర్డు సభ్యుడు నంగునూరి సత్యనారాయణ ప్రతిరోజూ 70 మందికి పైగా కరోనా బాధితులకు భో జనం అందిస్తున్నారు. సత్యసాయి సేవా సమితి, శ్రీరామ మన ఇంటి వంట బృందాలు బాధితుల ఇంటింటికీ వెళ్లి భోజనాన్ని అందజేస్తున్నారు. వీరితోపాటు గజ్వేల్కు చెందిన బబ్బూరి చంద్రాగౌడ్ కుటుంబానికి నిత్యావసర సరుకులను గౌడ సంఘం నాయకుడు వెంకట్గౌడ్ అందజేశారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ
హుస్నాబాద్ టౌన్, మే 20 : పట్టణంలోని 55 మంది బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను బాలవికాస సంస్థ ప్రతినిధులు పంపిణీ చేశారు. బాలవికాస వాటర్ ప్లాం ట్ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి మాట్లాడుతూ కరోనా బాధిత కుటుంబాలను బాలవికాస సంస్థ ఆదుకుంటుదన్నారు. కార్యక్రమంలో బాలవికాస సంస్థకు చెందిన కోఆర్డినేటర్ జ్యోతి, ప్రతిని ధులు నిర్మల, శ్రీమతి ఉన్నారు.
కరోనా బాధితులకు భోజనం అందజేత
ప్రశాంత్నగర్, మే 20 : కరోనా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కౌన్సిలర్ కవితాసంపత్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ స్ఫూర్తితో 4వ వార్డులో కరోనా బాధి తులు సమాచారం ఇస్తే భోజనం అందజేస్తామని తెలిపారు.
సరుకులను అందజేసిన బాలవికాస సంస్థ
కోహెడ, మే 20 : మండలంలోని రాంచంద్రాపూర్, విం జపల్లి గ్రామాల్లో కొవిడ్తో బాధపడుతున్న 25 కుటుంబా లకు నిత్యావసర సరుకులను బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, నాయకులు, బాలవికాస ప్రతినిధులు కె.అన్నామేరీ, వి.సబిత, ఎస్.సుజాత, ఎన్.లత పాల్గొన్నారు.
కరోనా వారియర్స్కు సరుకులు పంపిణీ
కూరెళ్ల గ్రామ సర్పంచ్ గాజుల రమేశ్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆశ వర్కర్లు, సఫాయి కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నముకు ధర్మయ్య, వార్డు సభ్యులు మార్గం తిరుపతి, గాజుల రవీందర్, ఈగ రాజుకుమార్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు బాలవికాస చేయూత
బెజ్జంకి, మే 20 : మండలంలోని తోటపల్లి, గాగిల్లాపూర్, గుగ్గిళ్ల గ్రామాల్లో కరోనా సోకిన కుటుంబాలకు బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిత్యావసర సరుకులను అందజేసి, మనోధైర్యం కల్పించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొయినిపల్లి నర్సింగరావు, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, సీతాలక్ష్మి, ఎంపీటీసీ కొమిరే మల్లేశం, బాల వికాస సంస్థ సభ్యులు అన్నమేరి, సుజాత తదితరులున్నారు.
బాధితులకు భోజనం ఇవ్వడం అభినందనీయం
సిద్దిపేట జోన్, మే 20 : కరోనా బాధితులకు సేవలు చేయడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేపట్టిన కరోనా బాధితులకు ఉచిత భోజనం తయారీ.. పంపిణీ తీరు ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వేళ అక్షయపాత్ర ద్వారా నిర్వహించే రూ.5 భోజనం మూసివేశారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, నారిసేన ఫ్రీఫుడ్ (గోపులాపురం దీప్తి), అమ్మ సహా యం హెల్పింగ్ హ్యాండ్స్, వీహెచ్పీ, సత్యసాయి కొండపాక ప్రతినిధులు కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అంద జేస్తున్నారని అభినందించారు. కరోనా బాధితులు, నిరాశ్రయులు, దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి భోజనం అందజేస్తున్న దాతలతోపాటు ఎన్జీవో సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బాధితులకు భోజనం అందించాలనుకునే వ్యక్తులు, ఎన్జీవో సంస్థలు తమ వివరాలు మున్సిపల్ ఆఫీస్ లో అందజేయాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
ఉచిత రేషన్ కిట్లు అందజేత
చిన్నకోడూరు, మే 20 : గోనెపల్లిలో ఎస్డీఐఎఫ్ ఆధ్వ ర్యంలో 16 కుటుంబాలకు రేషన్ కిట్లను ఎంపీపీ మాణిక్య రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల బాలయ్య, సర్పంచ్ స్వరూపాఎల్లాగౌడ్, ఉపసర్పంచ్ షాదుల్లా, ఎంపీటీసీ పద్మామల్లేశం, వార్డు సభ్యులు వెంకట్ గౌడ్, శివాజీగౌడ్, ఆకుల అరవింద్కుమార్ ఉన్నారు.